YCP: ఈ మధ్యకాలంలో వైసీపీ తీరు పూర్తిగా మారిపోతోంది. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాన్ని లొంగ తీసుకోవడానికి ఈడి సిబిఐ ఐటీ సంస్థలను కేంద్రంలో అధికారం చలాఇస్తున్నటువంటి బిజెపిని ఉసిగొల్పుతోంది అన్న విమర్శలు కూడా విల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఈడీ, సీబీఐ, ఐటీ అనేవి కేవలం కమోదీ సర్కార్ చేతిలో తోలుబొమ్మలన్నీ దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే విషయమై ఇటీవల సుప్రీంకోర్టులో పలు విపక్ష పార్టీలు పిటిషన్ ను కూడా వేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ లో అధికారం చెలాయిస్తున్న వైసీపీ వాదన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.
వివేకా హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నుతోంది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో అవినాష్రెడ్డి బెయిల్పై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయ వాది నిరంజన్ రెడ్డి కూడా ఇదే వాదన వినిపించారు. ఎటువంటి సాక్షాదారాలు లేకుండా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ అత్సుత్సాహాన్ని చూపుతోంది అంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రతి సారి అవినాశ్ ను టార్గెట్గా దర్యాప్తు చేస్తోందే తప్ప ఇతర కీలక అంశాలను పట్టించుకోవడం లేదని వాదించారు. శుక్రవారం అవినాశ్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో కూడా సీబీఐ దర్యాప్తు అధికారి రామ్సింగ్ తేడా మనిషని, అతను కుట్రపూరితంగా విచారిస్తున్నారని ఆరోపించారు.
అయితే ఒకవేళ అదే గనుక నిజం అయితే, అడిగినా, అడగకపోయినా కేంద్రంలో మోదీ సర్కార్కు మద్దతు ఇస్తున్న వైసీపీ ఆ మాత్రం కుట్రల్ని అడ్డుకోలేకపోతోందా? సీబీఐ అధికారి స్వతంత్రంగా అంత దూకుడు ప్రదర్శించే అవకాశం వుంటుందా? మరి మోదీ సర్కార్ ఏం చేస్తున్నట్టు? అన్యాయానికి గురి అవుతున్నామన్న భావనలో వైసీపీ వుంటే, ఆ విషయమై ఎలాంటి మాట సాయం చేయని మోదీ సర్కార్కు మద్దతు ఇస్తున్నట్టు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా చివరికి సీబీఐలో విచారణాధికారిని కూడా నియంత్రించలేని దయనీయ స్థితిలో వైసీపీ వుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే సీబీఐ అధికారి వల్లే తాను అన్యాయంగా వివేకా హత్య కేసులో ఇరుక్కుంటున్నానని అవినాశ్రెడ్డి ఆరోపిస్తున్నారు.