SmartPhone: ఆ ఫోన్‌ ధర వింటే అంతేనా అనాల్సిందే!

SmartPhone: ప్రస్తుతం వారానికి కొక స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల అవుతుంది. ఆయా కంపెనీలు పోటీపడి ఫీచర్లు, అనుకూలమైన ధరలు పెట్టి మార్కెట్లలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడొచ్చిన ఆ స్మార్ట్‌ఫోన్‌ మరీ తక్కువ ధరకే వస్తోంది. రెడ్‌మి–6ఏ, రెడ్‌మిౖ వె–3 రెడ్‌మి నోట్‌7ప్రో వంటి పలు రకాల స్మార్ట్‌ ఫోన్లను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది గతంలో ఎన్నడూ లేని సగం ధరకే వస్తోంది. రెడ్‌మి6ఏ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.6,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ.3,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్‌ సేల్‌ ఉన్నంత వరకే ఈడీల్‌ ఉంటుందని సదరు సంస్థ వెల్లడించింది. రెడ్‌మి6ఏ అనేది ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పొచ్చు.

 

ఇందులో హీలియో ఏ 22 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు ఎక్కువ సిమ్‌ కార్డులు వాడుతూ ఉంటే ఈ ఫోన్‌ను సెకండరీ ఫోన్‌గా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్‌ కార్డు, కూపన్‌ కోడ్‌ లేకుండానే నేరుగా ఈ ధరకే ఫోన్‌ కొనుగోలు చేయొచ్చు. అలాగే షావోమి రెడ్‌మి నోట్‌ 7 ప్రొ.,రెడ్‌ మి నోట్‌ 7 వంటి ఫోన్లను రూ.6 వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా రెడ్మీ నోట్‌ 4, రెడ్‌ మి వై1, రెడ్‌ మి వై2 వంటి పోన్లు కూడా రూ. 5 వేల కన్నా తక్కువ అందుబాటులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ ఫోన్లపై ఎలాంటి వారంటీ అందించడం లేదు. అలాగే లిమిటెడ్‌ ఆఫ్టర్‌ సేల్‌ సర్వీర్‌ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

రెడ్‌మి–5 ఫోన్‌ రూ. 4,499కు లభిస్తోంది. రెడ్‌ మి వై3 ఫోన్‌ రూ.5,999కు వస్తోంది. దీని ఎంఆర్పీ రూ. 11,999. రెడ్‌ 6 ప్రో ఫోన్‌ను రూ. 4,499కు కొనొచ్చు. దీని ఎంఆర్పీ రూ. 10,999. రెడ్‌ మి 6ఏ డ్యూయెల్‌ రూ. 5499 కు లభిస్తోంది. రెడ్‌మి నోట్‌ 7 ప్రో ఫోన్‌ ధర రూ.5,999గా ఉంది. ఇంకా రెడ్‌మి 7 ఫోన్‌ను రూ. 4,999కు సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ.9999. రెడ్‌మి 4 ఫోన్‌ రూ. 4499, రెడ్‌మి–5ను రూ. 4499 కు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌ మి 8ఏ ను రూ. 4499, రెడ్‌ మి నోట్‌ 3 రూ.4,999, రెడ్‌మి నోట్‌ 4 రూ. 4,999 పొందచ్చు. రెడ్‌ మి వై1 లైట్‌ ధర రూ.4,999, రెడ్‌మిౖవై–2 ధర రూ.4,999, రెడ్‌ మి వై–2 ఎంఆర్‌పీరూ. 10,499, రూ. 12,999 విలువైన రెడ్‌మి నోట్‌–7 రూ.5,999గా ఆఫర్లను ప్రకటించింది.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -