NTR: వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశం నుండి మూడవ తరం నటవారసుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే నేడు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. దీంతో గత ఏడాది నుంచి అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి.

అయితే సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలేవి పట్టించుకోకుండా తాజాగా ఎన్టీఆర్ తన తాత ఘాట్ దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించారు. అయితే ఎప్పుడు తెల్లవారుజామునే వెళ్లే ఎన్టీఆర్ ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా వెళ్ళాడు. భారీ జన సందోహం మధ్య అభిమానుల సమక్షంలో తారక రామారావుకి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్. అనంతరం సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. మీ పాదం మోపగా తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.

 

రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఆ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. ఆ పోస్ట్ ని చూసిన ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -