Aftab Confession: శ్రద్ధను 35 ముక్కలుగా నేనే నరికి చంపాను.. కసాయి అఫ్తాబ్‌ సంచలన వాంగ్మూలం!

Aftab Confession: ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్‌ హత్య కేసు పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రియురాలిని నిందితుడు అఫ్తాబ్‌ అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అక్కడితే ఆగకుండా ఫ్రిజ్‌లో శ్రద్ధ డెడ్‌బాడీ ముక్కలను ఉంచి రోజుకొకటి చొప్పున ఎవరూ లేని ప్రదేశంలో పడేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసిన దేశ ప్రజలు అఫ్తాబ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తర్వాత అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు కస్టడీలో అఫ్తాబ్‌ అనేక కీలక విషయాలు వెల్లడించాడు. తాజాగా శ్రద్ధ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలాకు పోలీసులు నార్కోటెస్ట్‌ చేశారు. ఇందులో అఫ్తాబ్‌ ఒళ్లు గగుర్పొడిచే నిజాలు చెప్పాడని తెలుస్తోంది.

బ్రేకప్‌ చెప్పింది.. అందుకే ఇలా చేశా..
శ్రద్ధ తనకు బ్రేకప్‌ చెప్పిందని, వెళ్లిపోతానని బెదిరించిందంటూ అఫ్తాబ్‌ చెప్పాడు. తనను విడిచి వేరొకరితో వెళ్లిపోతుందేమోనని అనుమానంతోనే శ్రద్ధను హత్య చేశానని అఫ్తాబ్‌ ఒప్పుకున్నాడు. ఈ కోపంతోనే ఆమెను 35 ముక్కలుగా నరికానని అంగీరించాడు. ఈ మేరకు అతడు నార్కో టెస్ట్‌లో ఒప్పుకున్నాడని ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందుతోంది.

అందులో చెప్పిన సమాధానాలే ఇక్కడ కూడా..
ఇదివరకే నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అందులో చెప్పిన సమాధానాలే ఇప్పుడు నార్కో టెస్ట్‌లోనూ చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రద్ధను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధంపై పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాడు. శ్రద్ధ వేసుకున్న దుస్తులు, ఆమె దుస్తులు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -