Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల పల్లెలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర రోడ్డు షో నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు బీసీవై పార్టీ మేనిఫెస్టో పాంప్లెట్లు పంపిణీ చేస్తూ వెళుతుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.
ప్రచారం చేస్తున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతటి ఆగకుండా పంపిణీ చేసిన పాంప్లెట్లు చింపి వేయడమే కాకుండా బీసీవై పార్టీ అభ్యర్థులపై తీవ్రస్థాయిలో దుర్భాషలో ఆర్డర్ అలాగే ప్రచార రథాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇక ఈ ప్రచారానికి వచ్చినటువంటి వారందరూ బొలెరో వాహనంలో వెళుతూ ఉండగా రాళ్ల దాడి చేసి బొలోరో అద్దాలు అన్నింటిని ధ్వంసం చేశారు.
ఈ విధంగా వైసిపి నేతలు బిసివై పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో దాడి చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇలా రెండు పార్టీ నేతల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ గొడవను సర్దుమని గారు అయితే కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు.