Maruti: ఇండియాలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల కార్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త కార్లను కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది మారుతీ. ఈ కొత్త బాలెనోను మరింత బెటర్ గా మార్చేందుకు కొత్త అప్డేట్ను అందించింది. ఈ అప్డేట్తో ప్రీమియం హ్యాచ్బ్యాక్లో కొత్త ఫీచర్లు వచ్చాయి. ఆ ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..మారుతి ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో కోసం కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది.
ఈ అప్డేట్ తర్వాత, కారు తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ లభిస్తుంది. అయితే, కారు జీటా అండ్ ఆల్ఫా వేరియంట్లు మాత్రమే సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రయోజనాన్ని పొందుతాయి. అలాగే కొత్త అప్డేట్ తర్వాత కారు ఆటో కనెక్టివిటీ ని పొందుతుంది. ఇది హెడ్స్ అప్ డిస్ప్లే లో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మల్టీ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఎనేబుల్ చేస్తుంది. ప్రస్తుత బాలెనో ఫిబ్రవరి 2022లోనే లాంచ్ చేయబడింది. దీనిని పాత బాలెనోతో పోల్చితే చాలా మార్పులు చేయబడ్డాయి.
కాగా ఇందులో 360 డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, సుజుకి కనెక్ట్, క్రూయిజ్ కంట్రోల్, బ్యాక్ ఏసీ వెంట్లు, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, యాంటీ పించ్ విండోస్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మారుతి ఈ కారు ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే వీటి ధర విషయానికి వస్తే.. బాలెనోలో సిగ్మా, డెల్టా, జీటా అండ్ ఆల్ఫా వేరియంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీని ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.