Police Lock Dargah: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఎంతటి ప్రసిద్ధి చెందినదో మనకు తెలిసిందే. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి దర్గా కూడా ఉండటం విశేషం ఇలా ఈ ఆలయానికి వచ్చినటువంటి వారు కూడా దర్గాని నమస్కరించుకుంటారు అయితే తాజాగా ఈ దర్గాకు తాళం పడింది. ఈ విధంగా ఈ దర్గాకు పోలీసులు వచ్చి తాళాలు వేసుకొని పోవటం ప్రస్తుతం చర్చలకు కారణమైంది.
ఇన్ని రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లింలు అందరూ కూడా పెద్ద ఎత్తున నమాజ్ నిర్వహించుకునేవారు అయితే ఉన్నఫలంగా ఈ దర్గాకు తాళం వేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే ఈ దర్గా విషయంలో ముస్లిం వర్గానికి చెందినటువంటి రెండు గ్రూపులు పెద్ద గొడవను సృష్టించాయి ఈ దర్గా మా తాతల కాలం నుంచి మా ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది అంటూ ఒక వర్గం ఈ దర్గా పై హక్కులను మాకే ఉన్నాయి అంటూ మరో వర్గం వారు పెద్ద ఎత్తున గొడవకు దిగారు.
గతంలో కూడా ఈ దర్గా విషయంలో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకోవడంతో ఓవర్గానికి చెందినటువంటి ముస్లిం సోదరులు ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించారు అయితే తాజాగా మరోసారి ఇలా రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్నటువంటి స్థానిక పోలీసులు దర్గాను సందర్శించి దర్గాకు తాళం వేసి ఈ దుర్గా పై ఎవరికి పూర్తి హక్కులు ఉన్నాయి అనే విషయం గురించి సరైన ఆధారాలు తీసుకురావాలని పోలీసులు ఆ రెండు వర్గాల ముస్లిం సోదరులకు తెలియజేసి దర్గాకు తాళం వేశారు.