YS Sharmila: ఏపీకి మరో దత్త పుత్రుడు వచ్చాడు.. వైరల్ అవుతున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మనం దత్త పుత్రుడు అనే పదాన్ని ఎక్కువగా విని ఉంటాము. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ మాట్లాడుతూ ఉంటారు.. ఇలా పవన్ కళ్యాణ్ పేరును కూడా పలకడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ చేసే వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనంగా మారాయి.

ఇకపోతే తాజాగా వైయస్ షర్మిల ఏపీకి మరో దత్తపుత్రుడు వచ్చాడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రచార సభలలో భాగంగా షర్మిల మాట్లాడుతూ ఏపీకి మరో దత్తపుత్రుడు వచ్చారని ఆయన మరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడిగా మారారంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద పెట్టారు తన వాళ్లను కేసుల నుంచి రక్షించుకోవడానికి సిబిఐ దాడులు జరగకుండా ఉండడానికి మోడీ వద్ద మోకరిల్లారని షర్మిల విమర్శలు చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడుగా మారారంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలను వైసిపి ప్రత్యర్థులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తరచూ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటే విమర్శించే జగన్మోహన్ రెడ్డి చివరికి దత్తపుత్రుడుగా మారిపోయారు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇది షర్మిల స్క్రిప్ట్ ఆ లేకపోతే ఆ భగవంతుడు ఇచ్చిన స్క్రిప్ట్ అంటూ మరికొందరు షర్మిల వ్యాఖ్యలపై స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడు అంటూ భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -