CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద ఎత్తున భూకబ్జాలు చేశారు. అయితే ఇవన్నీ చాలావన్నట్టు చిరు వ్యాపారలపై కూడా వైకాపా నేతల దృష్టి పడింది.

ఇలా రోడ్డుపై పాలు పువ్వులు పండ్లు అమ్ముకొని చిరు వ్యాపారుల కష్టాన్ని కూడా వైసిపి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం నుంచి ఎండ వాన గాలి అనక కష్టపడుతూ జీవనోపాధిని వెతుకుంటున్నటువంటి వీరికి కష్టాన్ని వారికి తెలియకుండానే వైసిపి నేతలు దోచుకుంటున్నారు.

ఇలా చిరు వ్యాపారులకు వడ్డీ లేనటువంటి రుణాలను తమ ప్రభుత్వం అందిస్తుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే జగనన్న తోడు వడ్డీ లేని రుణాలు అంటూ చిరు వ్యాపారులకు పదివేల రూపాయలను అందజేశారు అయితే ఈ పదివేల రూపాయలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వడ్డీ చెల్లిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రకటించకుండా తానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పలు చెబుతున్నారు.

ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసి వారి నుంచి అత్యధిక వడ్డీనే రాబడుతూ వారు కడుపులు నింపుకుంటున్నారు. పైగా ప్రజలందరిని తన మాటలచేత నమ్మించి మోసం చేసే టాలెంట్ జగన్మోహన్ రెడ్డిలో ఎక్కువగానే ఉందని చెప్పాలి. పార్టీలు చూడం కులం చూడం మతం చూడం అర్హులందరికీ పథకాలు అందిస్తామంటూనే కష్టజీవుల కష్టాన్ని దోచుకుంటున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి ఇలా చివరికి చిరు వ్యాపారాలపై కూడా ఆయన జాలీ దయ కనికరం చూపలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -