Mister And Misses: మిస్టర్ అండ్ మిసెస్ అంటూ వచ్చేస్తున్న శ్రీముఖి.. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదుగా!

Mister And Misses: తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా ఈటీవీలో ఇలా బుల్లితెర కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయనీ చెప్పాలి. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు ఆలీతో సరదాగా, పాడుతా తీయగా స్వరాభిషేకం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రసారమై ప్రేక్షకులను సందడి చేశాయి. ఇకపోతే టెలివిషన్ లో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ తాజాగా మరొక కార్యక్రమమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా పదిమందికి బుల్లితెర రియల్ కపుల్స్ ను ఆహ్వానించి వారికి పలు టాస్కులను నిర్వహించనున్నారు. ఇక ఈ టాస్కులలో గెలుపొందిన జంటకు ప్రత్యేకమైన ప్రైజ్ మనీ ఉంటుందని సరికొత్త షోని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమాన్ని అక్టోబర్ 11వ తేదీన ఈటీవీలో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఈ కార్యక్రమానికి మొదటిసారిగా స్నేహ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే నటుడు శివ బాలాజీ కూడా ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నారు.

అక్టోబర్ 11వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి ఇది వరకే ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వారంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ప్రతి మంగళవారం రాత్రి 9:30లకు మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమం ద్వారా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -