Rambha Car Accident: కారు యాక్సిడెంట్ తో ఆస్పత్రిలో రంభ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Rambha Car Accident: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ సోషల్ మీడియాలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటున్నారు. పెళ్లి తరువాత ఆమె కుటంబంతో హాయిగా జీవిస్తున్నారు. సినిమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. అయితే, ప్రస్తుతం రంభ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే రంభ కారుకు ప్రమాదం జరిగిన ఘటన.
దీనిపై రంభ ఎమోషనల్ పోస్టు పెట్టింది. కారు ప్రమాదంలో తన ఫ్యామిలీలో అందరికీ గాయాలయ్యాయని తెలిపింది. అయితే, తమకు చిన్న చిన్న గాయాలే అయ్యాయని, తన కుమార్తె సాషా మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉందని తెలిపింది రంభ. తన కోసం మీరంతా ప్రార్థించాలని అభిమానులను, ప్రముఖులను కోరింది. రంభ ఇన్ స్టా గ్రామ్ లో ఈ పోస్టు పెట్టడంతో అందరూ స్పందిస్తున్నారు.
రంభ పోస్ట్ పై అభిమానులు, సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రంభ తెలిపింది. అనుకోకుండా ఇంకో కారు తమ కారును ఢీకొట్టిందని, ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని రంభ వాపోయింది. ఈ సమయంలో తమ కుటుంబానికి అందరూ అండగా నిలవాలని కోరింది రంభ. ఈరోజు అసలు బాగోలేదని, బ్యాడ్ టైమ్, బ్యాడ్ లక్ అంటూ ఇన్ స్టా పోస్టులో రంభ పేర్కొంది.
ఓహ్ గాడ్.. మీకోసం ప్రార్థిస్తాం..
రంభ ప్రమాదం గురించి తెలుసుకున్న సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తున్నారు. మీ ఫ్యామిలీ కోసం నేను ప్రార్థిస్తానని నటి పాయల్ రాజ్ పుత్ చెప్పారు. బిగ్ బాస్ ఫేమ్ ప్రియ కూడా రంభ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తానంది. ధైర్యంగా ఉండాలని, మీ కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తానని తెలిపింది. మీరు సురక్షితంగా బయట పడ్డారు. అదే మాకు సంతోషంగా ఉంది.. మీ కోసం నేను ప్రార్థిస్తాను.. అని మరో నటి శ్రీదేవి విజయ్ కుమార్ కామెంట్ చేసింది. రాధికా శరత్ కుమార్ కూడా రంభ ఫ్యామిలీ సురక్షితంగా ఉండాలని కామెంట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -