Salem: వేడినీటిలో కారం కలిపి మరీ భర్తను చంపిన మహిళ?

Salem: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలికిచిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి. దాంతో కొన్ని కొన్ని సార్లు భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం వరకు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు లోని సేలం జిల్లా భారతీపురానికి చెందిన సెల్వ రాజ్, డయానా మేరీకి కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. సెల్వరాజ్ ఆటో నడుపుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే మద్యానికి బానిస అయ్యాడు.

 

తాగొచ్చి తరచూ మేరీతో గొడవపడేవాడు. భార్య ఎంత నచ్చజెప్పినా, పెద్దలు బుద్ధి చెప్పినా కూడా సెల్వరాజ్ తన తీరు మార్చుకోలేదు. దాంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు కాపురానికి పిలిచినా ఆమె రాలేదు. అల్లుడిలో కూడా మార్పు రాకపోవడంతో ఆమెను సెల్వరాజ్ వద్దకు పంపలేదు. అయితే ఈ నెల 5న భార్య కోసం అత్తింటికి వెళ్ళి తనతో రావాలని కోరగా అందుకు మేరీ అంగీకరించలేదు. నీ పద్ధతి మార్చుకుంటేనే వస్తానని తెగేసి చెప్పింది. తనతో రావడానికి అంగీకరించలేదని భార్య మేరీతో గొడవకు దిగాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా ఈ క్రమంలోనే భార్య మేరీపై చేయి చేసుకున్నాడు సెల్వరాజ్.

పుట్టింటికి వచ్చి కొట్టడంతో మేరీ భర్తపై కోపంతో ఊగిపోయిన మేరీ పోయి మీద కాగుతున్న నీళ్లలో కారం కలిపి భర్త సెల్వరాజ్ పై పోసింది. మరుగుతున్న నీళ్లు, కారం మంటలు భరించలేక గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇరుగు పొరుగు అతడ్ని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ సెల్వరాజ్ కోలుకోలేదు. పది రోజులకు పైగా చికిత్స పొందుతూ తాజాగా మరణించాడు. అయితే సెల్వరాజ్ హాస్పిటల్ లో చేరేటప్పుడే వాంగూల్మమిచ్చాడు. తన భార్య, అత్త కలిసి తనపై కారం కలిపిన వేడి నీళ్లు పోసి హత్యాయత్నం చేశారని చెప్పడంతో దాంతో మేరీ, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -