Raghuvaran: ఎమోషనల్ అయిన నటుడు రఘువరన్ భార్య.. ఏమైందంటే?

Raghuvaran: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటుడు రఘువరన్ అలాగే నటి రోహిణి ఒకరు. దివంగత నటుడు రఘువరన్ ఎన్నో తెలుగు తమిళ భాషలలో నటుడిగా నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈయన విలన్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన నటి రోహిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 

ఈ విధంగా రఘువరన్ రోహిణిల వివాహం 1996లో ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు సంతోషంగా కొనసాగలేదని చెప్పాలి 1996 లో వివాహం చేసుకున్నటువంటి ఈ జంట 2004లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులతో ఒంటరి అయినటువంటి వీరిద్దరూ వారి సినీ కెరియర్ పై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలోనే విలక్షణ నటుడిగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రఘువరన్ 2008 మార్చి 19వ తేదీ కన్నుమూశారు.ఇక రోహిణి మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.ఇకపోతే మార్చి 19వ తేదీ రఘువరన్ వర్ధంతి కావడంతో నటి రోహిణి తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ తన భర్త కనుక నేడు బ్రతికే ఉంటే మా జీవితాలు మరోలా ఉండేవని ఈమె తెలియజేశారు.

 

ఇకపోతే ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి కూడా ఈమె మాట్లాడుతూ రఘువరన్ కనుక ఇప్పుడు బ్రతికి ఉంటేనేటి సినిమాలను ఆయన కచ్చితంగా ఇష్టపడి సంతోషించేవారు అంటూ తన భర్త కుమారుడితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -