East Godavari: కూతురి కోసమే బతికిన తండ్రి.. కానీ చివరికి?

East Godavari: సాధారణంగా పిల్లలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు కూడా చూసి సంతోషిస్తూ ఉంటారు. పిల్లలు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలే పంచప్రాణాలుగా వారి కోసమే కష్టపడుతూ నిరంతరం వారి కోసమే శ్రమిస్తూ ఉంటారు. కానీ ఈ విషయం చాలామంది యువత గమనించకుండా చిన్నచిన్న విషయాలకే ఊహించని విధంగా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడడం లాంటివి చేసి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారు.

ఇటీవల కాలంలో అలాంటి ఘటనలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేటలో కవల వెంకటేశ్వరరావు దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వరరావు ప్రతిరోజు రాజమండ్రి రైతు బజార్ కు వెళ్ళి కూరగాయలు విక్రయిస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. సంపాదన చాలక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో వెంకటేశ్వరరావు అనారోగ్యం పాలయ్యాడు. తను సంపాదించిన డబ్బు మందుల కోసం ఉపయోగించకుండా పిల్లల ఖర్చు కోసం వస్తుంది అని భావించి చికిత్స కూడా తీసుకోవడం మానేశాడు.

ఇదే విషయం గురించి ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న కుమార్తె సత్యనాగు అనే 19 ఏళ్ళ యువతి తండ్రితో పలుసార్లు మాట్లాడి నచ్చప్పడానికి ప్రయత్నించింది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని లేకుంటే తాను చదువు మానేస్తాను అని పలుసార్లు తండ్రిని బెదిరించింది. అప్పుడు వెంకటేశ్వరరావు తన ఆరోగ్యం కుదుటపడుతుందని కూతుర్ని బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే చాలు మనకు కష్టాలు గట్టెకుతాయని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ వహించకపోవడంతో సత్య తీవ్ర మనస్థాపానికి లోనయ్యింది. తన తండ్రి సంపాదించిన డబ్బు ఆరోగ్యం కోసం కాకుండా తన చదువులకే ఖర్చు పెడుతున్నాడు అని భావించిన సత్య ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. పిల్లల కోసం కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకుని కూతుర్ని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి కూతుర్ని అలా విగత జీవిగా చూడడంతో ఒక్కసారిగా గుండెలు విలసేలా రోధించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -