Dr BR Ambedkar Konaseema: వ్యక్తిపై స్నేహితుడు దుర్మార్గం.. భార్యను ఆ మాట అన్నాడని?

Dr BR Ambedkar Konaseema: మన ఇంట్లోని పెద్దవారు కోపాన్ని తగ్గించుకో ఆవేశాన్ని తగ్గించుకో అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కోపంలో అనే మాటలకు,చేసే చేష్టలకు ఆ తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కోపంలో మనం చేసే తప్పుడు పనుల వల్ల జీవితాలు తలకిందులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మంచిగానే ఉండాలి. లేదంటే ఆవేశంలో అన్న మాటలే చాలా అనర్థాలకు దారి తీస్తాయి. తాజాగా ఒక యువకుడు అన్న మాటలే అతడి ప్రాణాల మీదకు తెచ్చాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏలేశ్వరం లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన కోరాడ మణికంఠ, దుర్గా ప్రసాద్ ఇద్దరు స్నేహితులు. అయితే ఈ నెల 11 రాత్రి మణికంఠను దుర్గాప్రసాద్ కారులో బయటకు తీసుకెళ్లాడు. ఎంత సేపైనా ఇంటికి రాలేదు. అయితే అనుమానం వచ్చిన మణికంఠ తండ్రి శ్రీనివాసరావు తన బంధువులతో కలిసి వెతికాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు రాగానే కారులో వస్తున్న దుర్గా ప్రసాద్ ను నిలదీశాడు.

 

అయితే మొదట తనకు తెలియదని బుకాయించిన దుర్గా ప్రసాద్ ఆ తర్వాత గట్టిగా అడగడంతో తానే చంపేసినట్లు అంగీకరించాడు. తన తాతను మణికంఠ తిట్టాడని, ఎందుకు రా తిట్టావని అడిగితే. నువ్వు ఊరిలో లేనప్పడు నీ పెళ్లాం, పిల్లల పీకలు కోస్తానని
అనడంతో కోపంతో తానే బయటకు తీసుకెళ్లి కారుతో తొక్కించి చంపేశానని దుర్గా ప్రసాద్ వెల్లడించాడు. మణికంఠ తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సతీష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -