Jio Laptop: జియో కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు.. తక్కువ ధరకే ల్యాప్ టాప్!

Jio Laptop: టెలికాం రంగంలో జియో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ ధరకే డేటాను అందించడం జియోతోనే స్టార్ట్ అయింది. అప్పటివరకు డేటా ధరలు మండిపోయేవి. దీంతో మొబైల్ లో నెట్ వాడకం తక్కువగా ఉండేది. కానీ జియో తొలుత ఫ్రీగా డేటా ఇవ్వడం, ఆ తర్వాత తక్కువ ధరకే డేటా రీచార్జ్ ప్లాన్ లు అందించడంతో.. మిగతా టెలికాం కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు.

ఇక తక్కువ ధరకే ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్లను జియో అందుబాటులోకి తెస్తుంది. అయితే ఈ సారి ల్యాప్ టాప్ ల తయారీపై కూడా జియో దృష్టి పెట్టింది. త్వరలోనే జియో నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్ రానుంది. కేవలం రూ.20 వేలకే ఈ ల్యాప్‌టాప్‌ను జియో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ నెలాఖరులో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గత ఏడాది జులైలో జియో బుక్ పేరుతో ఒక ల్యాప్ టాప్ ను జియో విడుదల చేసింది. దానికి అప్డేట్ వెర్షన్ గా ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను జియో తీసుకొస్తుంది.

 

అమెజాన్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్‌టాప్ కు సంబంధించిన మైక్రోసైట్ ను అందుబాటులోకి తెచ్చారు. జులై 31న జియో బుక్ ల్యాప్‌టాప్ విడుదల కానుండగా.. బ్లూ రంగులో ఇది ఉంటుంది. దీని బరువు 990 గ్రాములు ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్, జియోఓఎస్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. అలాగే 4జీ కనెక్టివిటీతో పాటు ఒక రోజంతా బ్యాటరీ లైఫ్ ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. జియో బుక్ ల్యాప్‌టాప్‌ను గతంలో రూ.15,799కే విక్రయించారు. ఇప్పుడు కొత్త ఫీచర్లతో వచ్చిన దీని ధర రూ.20 వేల లోపే ఉంటుంది.ఇక త్వరలో 5జీ ఫోన్ ను కూడా జియో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -