United States: కొందరు మనుషులు డబ్బు సంపాదించడం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇంతటి నీచనికైనా కూడా సిద్ధపడుతున్నారు. చివరికి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. కొంతమంది అయితే బతికున్న వారిని మాత్రమే కాకుండా చనిపోయిన శవాలను కూడా విడిచిపెట్టడం లేదు. ఒక మహిళ కూడా అలాంటి పనే చేస్తూ చివరికి జైలు పాలు అయింది. అసలేం జరిగిందంటే.. అమెరికా లోని అర్కాన్సాస్ చెందిన చాంపిమన్ స్కాట్ అనే 36 ఏళ్ళ మహిళ యూనివర్సిటీ అనాటమా ల్యాబ్లో పని చేస్తోంది.
యూనివర్సిటీకి వచ్చిన శవాలను వివిధ రకాల స్ప్రేలు చేసి భద్రపరచడం, మృతదేహాలను రవాణా చేయడం, వాటిని పూడ్చి పెట్టడడం ఆమె చేయాల్సిన పని. అయితే అనుకోకుండా ఆమెకు ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. తన పనిలో మెళకువలు తెలుసుకున్న స్కాట్ శవాల అవయవాలు అమ్మకం మొదలు పెట్టింది. పాలీ అనే వ్యక్తితో ఫేస్ బుక్లో పరిచయం పెంచుకుంది. అతడి ద్వారా శవాల అవయవాలను అమ్మటం మొదలు పెట్టింది. మొదట గుండె, రెండు మానవ మెదడులను అమ్మింది. ఇక అప్పటినుంచి 9 నెలలుగా ల్యాబ్కు వచ్చిన శవాల అవయవాలను అమ్మడం మొదలు పెట్టింది. అలా శవం నుంచి తీసిన ప్రతి అవయవాన్ని బాక్సులలో పెట్టి ఆన్ లైన్ ద్వారా పాలీకి అమ్మేది.
ఇక ఆ విషయం కాస్త 2022 జూన్ లో పోలీసులకు తెలిసింది. పక్కా ప్లాన్తో పోలీసులు ఆమెను జులైలో అరెస్ట్ చేశారు. నిందితుడు పాలీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో నిల్వ చేసిన మానవ అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.