Actor Pratyusha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ప్రత్యూష అకాల మరణం అందరిని ఎంతగానో కలచివేసింది.ఇలా ఈమె మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఈమె మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.అసలు ప్రత్యూష మరణానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ప్రత్యూష తల్లి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కూతురు మరణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రత్యూష మరణ వార్త తెలుసుకున్న అనంతరం ఈమె కేర్ హాస్పిటల్ కి వెళ్లి అసలు తన కూతురు ఎలా మరణించిందనే విషయం గురించి ఎంక్వయిరీ చేసినప్పటికీ అసలు విషయం తెలియలేదని అయితే తన కూతురు దుస్తులను ఇవ్వమని అడిగితే కేర్ హాస్పిటల్ యాజమాన్యం తన కూతురి దుస్తులను కాల్చివేశారు అంటూ తనకు చెప్పారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
అయితే తన కూతురు మరణం గురించి కేర్ హాస్పిటల్ యాజమాన్యం ఏదో దాస్తుందని ఈమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఇకపోతే ప్రత్యూషపై అత్యాచారం జరగడం వల్లే తాను మరణించిందని తన తల్లి ఆరోపణలు చేశారు. తనకు తెలిసినంతవరకు ప్రత్యూషని నాలుగైదు గెస్ట్ హౌస్ లు తిప్పి తనపై అత్యాచారం చేశారని, ఇలా ఐదవ గెస్ట్ హౌస్ లో తను కోమాలోకి వెళ్లిపోవటంతోనే భయంతో తనని కేర్ హాస్పిటల్ లో చేర్పించారని ఈమె ఆరోపించారు.
సిద్ధార్థ రెడ్డి గ్యాంగ్ తనపై ఇలాంటి అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా కోర్టులో కేసు నడుస్తుందని అయితే సిద్ధార్థ రెడ్డి నోరు విప్పితేనే ఈ ఘటన వెనుక ఎవరెవరన్నారు అనే విషయం బయటకు వస్తుందంటూ తన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం నోరు విప్పరు ఆయన సంతోషంగా పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. తన కూతురికి మాత్రం అన్యాయం జరిగింది అంటూ ఈ సందర్భంగా ప్రత్యూష తల్లి తన కూతురు పట్ల జరిగిన దారుణమైన ఘటనను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.