Bigg Boss Show: బిగ్ బాస్ షో గురించి నటి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Bigg Boss Show: సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ పైనే. సాధ్యమైనంత వరకు చూస్తున్నారు, వీలైనంతవరకు అందులో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళ నేము,ఫేము మారుతాయి అని కంటెస్టెంట్ల అభిప్రాయం. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ తీసుకుంటే, చాలామంది ఉన్న కెరియర్ ని కూడా పోగొట్టుకున్నారు.

 

ఇప్పుడు ఒక నటి అలాగే తన బిగ్ బాస్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఆమె పవిత్ర పునియా. ఈ బుల్లితెర నటి 2009 ఎంటీవీ స్పీల్ట్స్ విల్లా మూడో సీజన్లో, 2020 బిగ్ బాస్ 14వ సీజన్ లో పాల్గొంది. తాజాగా ఆమె అతను ఫేస్ చేసిన కష్టాల గురించి చెప్పింది. నేను బిగ్ బాస్ షో కి వెళ్ళినప్పుడు కోవిడ్ అంతా అల్లకల్లోలంగా ఉంది. రియాలిటీ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత పని దొరకడం కష్టమైపోయింది.

నా సేవింగ్స్ అన్ని వాడేసాను బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. నా దగ్గర లెక్క లేనంత సంపద ఉండాలని కోరుకోలేదు కానీ నాకు సడన్గా ఏదైనా అయి ఆసుపత్రిలో ఉంటే అమ్మను రూపాయి కూడా అడగకుండా నా బిల్లు నేను కట్టుకోగలిగేటంత మనీ ఉంటే చాలు అనుకున్నాను. కానీ అంత డబ్బు కూడా చేతిలో మిగలలేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల రోజులకు నాన్నకు యాక్సిడెంట్ అయింది.

 

దీనివల్ల సంవత్సరమున్నర పాటు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాధలు తట్టుకోలేక డిప్రెషన్ తో జీవితాన్ని చాలించాలనుకున్నాను. ఈ సమయంలో నా కుటుంబం తోడుగా నిలిచింది, చీకటి రోజుల నుంచి బయటపడేలాగా చేసింది కానీ చెప్పుకొచ్చింది ఈ భామ. ప్రస్తుతం ఈమె ఇష్క్ కి దస్తాన్ నాగమణి సీరియల్ లో నటిస్తుంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -