Anchor Rashmi: నా బాత్రూమ్‌లో కూడా కెమెరా పెడతారేమో.. రష్మి సంచలన వ్యాఖ్యలు!!

Anchor Rashmi: ఇండస్ట్రీకి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన రష్మి గౌతమ్ బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. రష్మి బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా రాణిస్తూనే వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల రష్మీ హీరోయిన్‌గా, నందు హీరోగా కలిసి జంటగా నటించిన సినిమా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో నందు రష్మిపై ఓ ఫ్రాంక్ వీడియోను చేశాడు. దీంతో రష్మీ హీరో నందుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఎం జరిగిందో ఒక్కసారి చూద్దాం.

రష్మి గౌతమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా హీరో నందు చేసిన ఫ్రాంక్ వీడియోపైన ఆమె వివరణ ఇచ్చారు. ఇక నందు చేసింది ఫ్రాంక్ వీడియోనే కావచ్చు కానీ.. అందులో నేను చెప్పింది నిజమే అని ఆమె వెల్లడించారు. సినిమా ప్రమోషన్ కోసం సడెన్‌గా పిలిస్తే ఎలా వస్తారంటూ పేర్కొంది. ‘తన షెడ్యూల్ కూడా చేసుకోవాలిగా.. నేను వేరే షెడ్యూల్ ఉంటె వచ్చి విసిగిస్తే ఎలా.. అవకాశం ఉంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు.’ అంటూ రష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.

నందు, రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ సినిమా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉండటంతో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. ఇక అందులో భాగంగానే రష్మిని ప్రమోషన్స్‌ కి రావడం లేదు.. మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడం, సినిమా ప్రమోషన్స్ కూడా రావడం లేదంటూ నందు ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియోపై రష్మి స్పందిస్తూ.. సినిమా గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారని, వాటిపై నేను ఆన్సర్ చేయలేనంటూ వెల్లడించింది. రష్మి ప్రమోషన్స్ కి వస్తా అని చెప్పినా.. చిత్ర బృందం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని ఆమె వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -