Shadnagar: మందు తాగొద్దని చెప్పినందుకు నిద్రపోయిన తర్వాత కరెంట్ పెట్టి అలా?

Shadnagar: భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు చిలకిచిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా భర్త మద్యం సేవించి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు తారస్థాయికి కూడా చేరుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు ఒకరినొకరు కొట్టుకోవడం చంపడం వరకు కూడా వెళ్తూ ఉంటాయి. మద్యం తాగిన మట్టిలో భర్తలు ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారు కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో జరిగింది. జిల్లాలోని షాద్ నగర్‌లో యాదయ్య, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన మొదట్లో భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రాను రాను యాదయ్య మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తరచూ తన భార్య కవితతో గొడవపడేవాడు. అలా వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు రావడంతో వారికి పెద్దలు సర్ది చెప్పారు. అప్పుడు కవిత యాదయ్య మరొకసారి మద్యం సేవించి రావడంతో తాగవద్దని సూచించింది. యాదయ్య మాటకి వినకపోవడంతో అతనితో వారించింది.

 

ఇక తనకి తన భార్య ఎదురు చెప్పడంతో కోపంతో ఊగిపోయిన యాదయ్య ఆమె నిద్ర పోయిన తర్వాత కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కరెంట్ షాక్ కొట్టి చనిపోయిందని చెప్పసాగాడు. అయితే కవిత బంధువులు మాత్రం అతడే చంపేశాడని చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాదయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -