Nara Lokesh: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఏపీలో వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జగన్ కి సవాల్ విసురుతూ కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదు వైఎస్ఆర్సిపి గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్త జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. తెలుగదేశం పార్టీకి గతంలో ఏమాత్రం పట్టులేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని, కానీ మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా?
అంటూ జగన్కు ఛాలెంజ్ విసిరితే స్వీకరించలేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్ గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి అయింది అంటూ జగన్ కి చురకలు అంటించారు నారా లోకేష్. అంతే కాకుండా ఏపీలో ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని యువతను మోసం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్లో చేసుకున్నట్లు చూపించారు అని తెలిపారు నారా లోకేష్.
జగన్ సీఎం అయిన తరువాత బాగుపడింది కేవలం భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమేనని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని నారా లోకేష్ తెలిపారు. అయినా జగన్ స్క్రిప్ట్ ఇస్తే తాము చదవాలా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి