Apsara: అప్సర హత్య అలా జరిగిందా.. సాయికృష్ణ అలాంటి వ్యక్తా?

Apsara: రెండు తెలుగు రాష్ట్రాలలో అప్సర హత్య కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వినిపిస్తూనే ఉన్నాయి. గంటకు ఒక ట్విస్టులతో ఈ కేసు మరింత ముదురుతోంది ఈ క్రమంలోనే తాజాగా ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. పూజారి సాయికృష్ణ చాలా అబద్ధాలు చెప్పాడని తెలీంది. చనిపోయిన వారం రోజుల తర్వాత అప్సర మృతదేహాన్ని కనుగొన్న పోలీసులకు, ఇవాళ్టి పోస్టుమార్టం రిపోర్టుతో మరిన్ని వివరాలు తెలిసొచ్చాయి. ఆమె ఎలా మరణించిందనే విషయంతో పాటు మరో షాకింగ్ విషయం కూడా విలువలోకి వచ్చింది.

అయితే మొదట అప్సర తల పైన బలమైన గాయం అవడం వల్లే ఆమె చనిపోయిందని ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నివేదికలో తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. రిమాండ్ లో కూడా పూజారి సాయికృష్ణ ఇదే విషయం వెల్లడించాడు. బెల్లంకొట్టే వస్తువుతో అప్సర తలపై బలంగా మోదినట్టు సాయికృష్ణ అంగీకరించాడు. అయితే పోలీసులు షాక్ అయ్యే మేటర్ ఇది కాదు. అప్సర గర్భందాల్చిందనే విషయాన్ని సాయికృష్ణ వెల్లడించాడు. తను గర్భవతినని, తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసిందని, పెళ్లి చేసుకోకపోతే తన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిందని, ఈ బెదిరింపులకు తట్టుకోలేక ఆమెను హత్య చేశానని సాయికృష్ణ పోలీసులకు వెల్లడించాడు.

కానీ ఈరోజు బయటకొచ్చిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం అప్సర గర్భవతి కాదనే విషయాన్ని వైద్యులు నిర్థారించారు. సరిగ్గా ఇక్కడే కుటుంబ సభ్యుల వాదనలు తెరపైకొస్తున్నాయి..అప్సరకు లొంగదీసుకున్నాడని, పెళ్లి చేసుకోమని అడగడంతో ఆమెను చంపేశాడని అప్సర తల్లి ఆరోపిస్తోంది. అటు సాయికృష్ణ భార్య మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైన వాదన వినిపిస్తోంది. అప్సర హత్య యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడిన ఆమె,

 

తన భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదని, టార్చర్ భరించలేక క్షణికావేశంలో అలా చేసి ఉంటాడని చెబుతోంది. అప్సరతో తన భర్త మాట్లాడుతుంటాడని, తన ఇంట్లో జరిగిన ఒక పూజా కార్యక్రమానికి కూడా ఆమె హాజరైందని సాయికృష్ణ భార్య తెలిపింది. అప్సరతో తన భర్తకు ఎలాంటి రిలేషన్ లేదని అంటోంది. తన భర్తను కావాలనే ట్రాప్ చేశారని, అప్సర లేట్ నైట్స్ ఇంటికొస్తుంటే, వాళ్ల అమ్మ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తోంది. ఇది ఇలా ఉంటే అప్సర అంత్యక్రియలు పూర్తిచేశారు ఆమె కుటుంబీకులు. పంచనామా తర్వాత మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందించగా, ఆ వెంటనే అంత్యక్రియల్ని పూర్తిచేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -