చైతన్య మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలమకున్నాయి. ఆయన మరణంతో ఎంతోమంది అభిమానులు , ఆయన శిష్యులు స్నేహితులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక చైతన్య మరణంతో అతని తల్లి లక్ష్మీ రాజ్యం తట్టుకోలేకపోతోంది. చైతన్య మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన లక్ష్మీరాజ్యం తన కొడుకు తనని మోసం చేశాడని గుండెలవిసేలా రోదిస్తోంది.
చనిపోవడానికి పావుగంట ముందు తన కొడుకు తనతో మాట్లాడాడని అయితే అంతలోపే ఆత్మహత్య చేసుకొని మమ్మల్ని మోసం చేశాడని తన బాధ బయటపెట్టింది. చనిపోవటానికి పావుగంట ముందు తనకి ఫోన్ చేసి మాట్లాడాడని, ఆ సమయంలో తనకు జరిగిన సన్మానం గురించి మాట్లాడారని లక్ష్మీరాజ్యం తెలిపింది.
సన్మాన కార్యక్రమంలో అలా డల్ గా ఉండకూడదని ఎంతోమంది గొప్ప వ్యక్తులు నీకు సన్మానం చేస్తుంటే నువ్వు అందర్నీ కలుపుకొని పోవాలని చెప్పినట్లు ఆవిడ వెల్లడించింది.
అంతేకాకుండా డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అనేవాడు. మనసు బాగాలేదు గుడికి వెళ్దామని అడిగితే తాను కూడా గుడికి వస్తానని చెప్పాడని లక్ష్మీరాజ్యం వెల్లడించింది. అప్పుల బాధతో తాను ఆత్మహత్య చేసుకొని మరణించి మమ్మల్ని అందరినీ మోసం చేశాడని, నాకు ఏడుపు కూడా రావటం లేదు అంటూ ఆవిడ కుమిలిపోతోంది.