Chaitanya Master: ఎమోషనల్ అయిన కొరియోగ్రాఫర్ చైతన్య తల్లి.. ఏమైందంటే?

Chaitanya Master: ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీ ద్వారా కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన చైతన్య మాస్టర్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుల బాధలు అధికం అవటంవల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక చైతన్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మరణించటానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసి షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చైతన్య మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలమకున్నాయి. ఆయన మరణంతో ఎంతోమంది అభిమానులు , ఆయన శిష్యులు స్నేహితులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక చైతన్య మరణంతో అతని తల్లి లక్ష్మీ రాజ్యం తట్టుకోలేకపోతోంది. చైతన్య మరణంతో తీవ్ర విషాదంలో మునిగిన లక్ష్మీరాజ్యం తన కొడుకు తనని మోసం చేశాడని గుండెలవిసేలా రోదిస్తోంది.

 

చనిపోవడానికి పావుగంట ముందు తన కొడుకు తనతో మాట్లాడాడని అయితే అంతలోపే ఆత్మహత్య చేసుకొని మమ్మల్ని మోసం చేశాడని తన బాధ బయటపెట్టింది. చనిపోవటానికి పావుగంట ముందు తనకి ఫోన్ చేసి మాట్లాడాడని, ఆ సమయంలో తనకు జరిగిన సన్మానం గురించి మాట్లాడారని లక్ష్మీరాజ్యం తెలిపింది.
సన్మాన కార్యక్రమంలో అలా డల్ గా ఉండకూడదని ఎంతోమంది గొప్ప వ్యక్తులు నీకు సన్మానం చేస్తుంటే నువ్వు అందర్నీ కలుపుకొని పోవాలని చెప్పినట్లు ఆవిడ వెల్లడించింది.

 

అంతేకాకుండా డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అనేవాడు. మనసు బాగాలేదు గుడికి వెళ్దామని అడిగితే తాను కూడా గుడికి వస్తానని చెప్పాడని లక్ష్మీరాజ్యం వెల్లడించింది. అప్పుల బాధతో తాను ఆత్మహత్య చేసుకొని మరణించి మమ్మల్ని అందరినీ మోసం చేశాడని, నాకు ఏడుపు కూడా రావటం లేదు అంటూ ఆవిడ కుమిలిపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -