Vizianagaram: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం ఇప్పటికీ ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. నిత్యం సమాజంలో అలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కూడా ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఒక ప్రియుడు తన ప్రియురాలితో మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఆమె భర్త రావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక బాల్కనీ నుంచి కిందికి దిగే ప్రయత్నం చేశాడు. దాంతో తీవ్ర గాయాల పాలైన అతడు మరణించాడు. అసలు ఏం జరిగిందంటే..
విజయనగరం జిల్లాకు చెందిన నాయుడు అనే ఏళ్ళ యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. అయితే నాయుడుకీ ఇంటర్ చదివే సమయంలో తన కాలేజీలో చదివే ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు ఆరేళ్ల కిందట ఓ ప్రొఫెసర్కు ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. అయినప్పటికీ నాయుడు ఆమెను మర్చిపోలేక, పాత పరిచయాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో నాయుడు ఆమె ఇంటికి వెళ్లాడు.
అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో భర్త రావడంతో అతడు ఇంటి వెనకాల ఉన్న బాల్కనీకు వెళ్లి అక్కడ నుంచి కిందికి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే పట్టు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో చేరుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించారు. అయితే కుమారుడు మృతిని తెలుసుకున్న నాయుడు తండ్రి కొడుకు మృతి పట్ల అనుమానం ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.