Andrea: కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ ఆండ్రియా జెర్మియా. గాయనిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కథానాయకగా రాణిస్తున్న నటి ఆండ్రియా. శరత్ కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి మత్తుచ్ఛరం చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలలో ఒకరిగా పరిచయం అయింది ఆండ్రియా. ఆ తర్వాత వరుసగా
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాలో కీ రోల్ చేసింది ఆండ్రియా.
తరువాత తడాఖా సినిమాలో సునీల్ కి జోడిగా ఈ మధ్యనే విడుదలైన వెంకటేష్ మూవీ సైంధవ్ లోనూ నటించిన ఆండ్రియా మంచి సింగర్ కూడా. తుప్పరివాలన్ చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించి ఆల్రౌండర్ అనిపించుకుంది. నటిగా గాయనిగా రాణిస్తున్న ఆండ్రియా చేతిలో ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, కా, మాళిగై చిత్రాలు ఉన్నాయి పిశాచి 2 చిత్రం లో ఈమె ఒంటిమీద నూలుపోగు లేకుండా నటించింది. అయితే ఆ తరువాత ఈ సన్నివేశాన్ని తొలగించినట్లు సమాచారం.
ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని చాలాకాలం అయింది అయినా ఎందుకో ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ భామ ఇప్పటికీ సింగిలే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేసింది. అమ్మాయిలకు ఒక ఏజ్ అంటూ వచ్చాక పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది. నాకు కూడా 30 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది.
ఆ వయసులో అలా అనిపించింది కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. నేను పెళ్లి వయసు దాటిపోయాను ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ఎంతో సంతోషంగా లీడ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అలాగే పెళ్లిపై ఆలోచనలు కూడా లేవు అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.