Evening: ఒక మనిషి అన్న తర్వాత వారి జీవితంలో కష్టసుఖాలు జయపజయాలు ఉంటాయి.అయితే కొందరి జీవితంలో మాత్రం ఎప్పుడు కష్టాలు అపజయాలు మాత్రమే ఉంటాయి. ఆ కష్టాల నుంచి బయటపడటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి జయం మాత్రం కలగదు. ఈ విధంగా కష్టాలతో సతమతమవుతున్నటువంటి వారు ఈ కష్టాల నుంచి బయటపడటానికి సాయంత్ర సమయంలో ఇలా చేస్తే చాలు.
మన హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలా సూర్యోదయం సమయంలోనూ సూర్యాస్తమ సమయంలోను కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా అని శుభ ఫలితాలే కలుగుతాయి. మరి ఈ కష్టాల నుంచి బయటపడి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే సంధ్యా సమయంలో ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతిరోజు సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో సూర్య నమస్కారం చేయాలి అలాగే సంధ్యా సమయంలో కూడా సూర్య నమస్కారం తప్పనిసరి.అదేవిధంగా సంధ్య సమయంలో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు ఇంట్లో ఇలా సంధ్యా సమయంలో నిద్రపోతే లక్ష్మీదేవి కోపానికి గురికావాల్సి ఉంటుంది. సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం.
దేవుడి గదిలో తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అవుతాము.అదేవిధంగా సంధ్య సమయంలో మన పెద్దలను తలుచుకొని వారి ఆశీర్వాదాలు మనపై ఉండాలని కోరుకోవాలి. ఈ విధంగా సంధ్యా సమయంలో ఈ నియమాలను పాటించడం వల్లఆర్థిక ఇబ్బందులు తోలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి
అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు.