Kodikatti Srinu: కోడి కత్తి శ్రీనుకి ఎప్పటికీ బెయిల్ రాదా.. అంటే పరిస్థితులని చూస్తే అలాగే అనిపిస్తుంది. గత నాలుగున్నర ఏళ్ల నుంచి కోడి కత్తి శ్రీను ని జైల్లోనే ఉంచి అతని తల్లికి కడుపు కోత మిగులుస్తున్నారు. అతని తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆరోపించారు. సీఎం జగన్ విచారణకు హాజరు కావడం లేదని ఆగ్రహించారు.
విదేశీ పర్యటనలు చేయటానికి టైం ఉంటుంది కానీ కోర్టులకి రావటానికి టైం లేదు. ఒకవేళ కోర్టుకి రాని పక్షంలో ఎన్ఓసి అయినా ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అలాగే మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు తల్లి హత్యలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, రోడ్లమీద చంపేసి మూట కట్టేసి పడేసినోళ్లకి బెయిల్ ఇస్తున్నారు కానీ తన కొడుకు మాత్రం నాలుగున్నరేళ్లు గా జైల్లో ఉన్నాడని కన్నీరు పెట్టుకున్నారు.
తన కుమారుడు బయటికి వస్తాడో,రాడో అతని కర్మ అలా కాలింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. మామూలుగా ఎలాంటి కేసులో అయినా 180 రోజుల తర్వాత బెయిల్ లభించాల్సి ఉంది కానీ ఇప్పటికీ బైలు లభించకపోవడం విచారకరం. అయితే దీని వెనక జగన్ కుట్ర ఉన్నట్టు ఆరోపిస్తున్నారు శ్రీను తరపు లాయర్లు. అప్పట్లో బీజేపీ సర్కార్ లో మంచి పట్టు ఉన్న జగన్ రెడ్డి లాబీయింగ్ చేసి ఎన్ఐఏ దర్యాప్తు వేయించుకున్నారు.
సీబిఐ విచారణ చేయాలంటే కోర్టు ఆదేశాలు ఉండాలి కానీ ముందుగానే ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవటంతో కోర్టు కూడా అంగీకరించింది. ఈ ఎన్ ఐ ఏ కేసులు చాలా తీవ్రమైనవి వీటికి బెయిల్స్ అంతా త్వరగా రావు. ఐదేళ్ల శ్రీను జీవితం జైలులోనే మగ్గిపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు తాము అనుకున్నట్లు రాలేదని జగన్ రెడ్డి పిటిషన్ మీద పిటిషన్లు వేయడం వలన విచారణ ఆలస్యం అవుతుంది. దీంతో శీను ని కావాలనే జైలు నుంచి బయటికి రాకుండా చేస్తున్నట్లు జైల్లోనే చంపేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి.