Rwanda Horror: ప్రస్తుత సమాజంలో మానవత్వం అన్నది కరువవుతోంది. ఎదుటి వ్యక్తులను అతికిరాతకంగా దారుణంగా హింసించి చంపడం కొట్టి చంపడం లాంటివి చేస్తున్నారు. సమాజంలో కొన్ని రకాల సంఘటనలు తెలుసుకుంటేనే భయంతో వణికి పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తప్పు చేశాడని నడిరోడ్డు పైనే నరకడం ప్రేమించాడని నరకడం ఇలా చిన్నచిన్న ప్రాణాలకే మనిషి ప్రాణాలు తీసి కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు.
తాజాగా ఒక దుర్మార్గుడు చేసిన నిర్వాకం వెలుగులోకి రావడంతో అందరూ అతని చేసిన పనిని తెలుసుకొని షాక్ అవుతున్నారు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసి, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం ఆ మృతదేహాలను కిచెన్లో గొయ్యి తీసి పాతిపెడతాడు. వినడానికి భయంకరంగా ఉన్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసి, ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం ఆ మృతదేహాలను కిచెన్లో గొయ్యి తీసి పాతిపెడతాడు.
ఇలా వరుసగా నేరాలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ను రువాండా రాజధాని కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ల నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు కొన్ని మృతదేహాలను యాసిడ్ వేసి కరిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.