Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రఘురామకృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈసారి మాత్రం ఈయనకు నరసాపురం నుంచి టికెట్ లేకపోవడంతో ఆందోళన చెందారు. ఎలాగైనా తాను ఎన్నికల సమయానికి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తానని ఈయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే రఘురామకృష్ణం రాజు తాను అనుకున్నట్టుగానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలో దిగారు. ఉండి నియోజకవర్గం నుంచి ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ముందుగా ఉండి అభ్యర్థిగా రామరాజును కేటాయించారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంచి పదవి కల్పిస్తానని చంద్రబాబు నాయుడు బుజ్జిగించి ఆయన స్థానంలో రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇచ్చారు.
ఇలా తనకు ఉండి ఎమ్మెల్యే టికెట్ రావడంతో పశ్చిమగోదావరి జిల్లా పెద్దఅమిరంలో రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం అధిష్టానం ఆదేశించిందని ఈయన తెలిపారు . ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో కలిసి తాను పనిచేస్తానని వెల్లడించారు.
పార్టీ నుంచి బి ఫామ్ అందుకొని ఈనెల 22వ తేదీ తాను నామినేషన్ దాఖలు చేయబోతున్నానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఈయనకు ఈ ఎన్నికలలో టికెట్ లేదని పలువురు భావించారు తనకు టికెట్ రాకుండా జగన్ తెరవెనక రాజకీయాలు చేశారని ఆరోపించారు కానీ తాను ఎన్నికలలో తప్పకుండా పోటీగా చేస్తానంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు అనుకున్న విధంగానే ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని చెప్పాలి.