Saranya: తెలుగు ప్రేక్షకులకు నటి శరణ్య ప్రదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శరణ్య ప్రదీప్ అంటే చాలామంది గుర్తుకు పట్టకపోవచ్చు కానీ ఫిదా మూవీ లో సాయి పల్లవి సిస్టర్ క్యారెక్టర్ అంటే చాలా గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది శరణ్య. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కలేదు. ఇప్పటివరకు సరైన పాత్ర కోసం వేచి చూసిన శరణ్య. తాజాగా ఒక సినిమాలో నటించి తన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది.
ఆ సినిమా మరేదో కాదు సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇందులో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో హీరో సుహాస్ అయినప్పటికీ, సినిమా చూసినవారంతా నటి శరణ్యనే హీరో అని అంటున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. కాగా మొదట్లో న్యూస్ రీడర్గా కెరీర్ని ఆరంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శరణ్య. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సాయి పల్లవి అక్కగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ శరణ్యకు ఆ స్థాయి గుర్తింపు రాలేదు.
కానీ ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు శరణ్యలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ సన్నివేశంతో పాటు స్కూల్లో విలన్తో వచ్చే సీన్లో శరణ్య నటన గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాకు ఎంతో కీలకమైన సీన్లో నగ్నంగా నటించి అందరిని షాక్కు గురి చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా శరణ్య ఆ సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ఆ సీన్ గురించి డైరెక్టర్ చెప్పగానే కాస్త భయం అనిపించింది. అలాంటి సన్నివేశంలో ఇంతవరకు నటించలేదు. కానీ నా భయాన్ని పోగొట్టి సపోర్ట్గా నిలిచింది మాత్రం నా భర్త. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. ధైర్యంగా నటించు అని నా భర్త ప్రోత్సహించాడు. అలాగే చిత్ర యూనిట్ కూడా నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ సీన్లో నటించేటప్పుడు సెట్లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి ఇలా ఐదుగురి సమక్షంలో చాలా కంఫర్టబుల్గా ఆ సీన్లో నటించాను. టీమ్ సహకారంతోనే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది అని శరణ్య చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శరణ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా శరణ్య నటనను మెచ్చుకుంటున్నారు.