Modinagar: ప్రియురాలితో హోటల్ కి వెళ్ళిన ప్రియుడు.. కానీ?

Modinagar: తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలిసి హోటల్ కి వెళ్ళారు. కానీ చివరికి ఇద్దరూ అలా మిగిలిపోయారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర్ ప్రదేశ్ లో మోదీనగర్ లో మధు అనే 22 ఏళ్ళ యువతి నివసిస్తోంది. మధుకి గతంలో ఒక యువకుడితో పెళ్లి అయ్యింది. కొన్నాళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ మధు పెళ్లి కంటే ముందే హిమాంశు అనే 20 యువకుడితో ఉంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

దీంతో ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లైనప్పటికీ మధు ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. ఇదిలా ఉండగానే ఉన్నట్టుండి మధు భర్త చనిపోయాడు. ఇక కొన్ని రోజుల తర్వాత మధు తల్లిదండ్రులు ఆమెకు స్థానికంగా ఉండే మరో యువకుడితో వివాహం జరిపించారు. అలా కొద్దీ రోజులు గడిచింది. మధుకు ప్రియుడు హిమాంశు పై ఉన్న ఇష్టం మాత్రం తగ్గిపోలేదు. అయితే, ఇటీవల హిమాంశు తన ప్రియురాలైన మధుని తీసుకుని గాజియాబాద్ లోని ఒక హోటల్ కు వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఒక గంట తర్వాత హోటల్ నిర్వాహకులు ఆ ప్రేమికులు ఉన్న గదిలోకి వెళ్లి చూశారు.

 

అక్కడ బెడ్ పై మధు హత్యకు గురి కాగా, ఆమె ప్రియుడు అదే గదిలో ఫ్యానుకు ఉరి వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసి హోటల్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక హోటల్ నిర్వాహకుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మధు భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో మాత్రం ప్రియుడు హిమాంశు ప్రియురాలు మధును హత్య చేసి ఆ తర్వాత తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -