Bellandur: భార్య కోసం అత్తింటికి వెళ్లిన వ్యక్తి.. చివరికి?

Bellandur: ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్ల పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమ కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం భార్యను కష్టాలు పెట్టడం ఎదురు తిరిగితే చంపేయడం లాంటివి కూడా చేస్తున్నారు. అయితే చాలా మంది భార్య భర్తలు ప్రేమించి పెళ్లి చేసుకొని చిన్న చిన్న తగాదాలకే విడిపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొందరు భర్తలు పంతాలను పక్కనపెట్టి భార్యను తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటారు.

నా భార్య కోసం వెళ్లిన ఒక అతనికి పోషించిన అనుభవం ఎదురవడంతో దారుణానికి ఒడిగట్టాడు. తాళి కట్టిన భార్యను తనతో పంపించనందుకు ఏకంగా అత్తని హత మార్చాడు. అసలేం జరిగిందంటే.. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మనోజ్, వర్షితా ఇద్దరు భార్యా భర్తలు. వీరిది ప్రేమ వివాహం. అయితే పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్లు పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత భర్త మనోజ్ పని చేయడం మానేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో వర్షితా గొడవపడి బెల్లందూరు సమీపంలోని ఇబ్బలూరు లోని తన అమ్మ గీత ఇంటికి వచ్చేసింది.

అయితే తన భార్యను తిరిగి తెచ్చుకునేందుకు అత్తింటికి వెళ్లాడు అల్లుడు మనోజ్. అమ్మాయిని పంపేదీ లేదంటూ అత్త గీత తెగేసి చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దాంతో ఆవేశంతో ఊగిపోయిన అల్లుడు అత్త గీతను పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక గీతా కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నిందితుడిని అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -