Mother: కన్నీళ్లు పెట్టుకున్న యువతి తల్లి.. కూతురికి అలా జరగడంతో?

Mother: తాజాగా ప్రియురాలిని లాడ్జికి పిలిచి దారుణంగా పొడిచి చంపాడని వార్త బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసింది. అయితే నిజానికి వారిద్దరూ లవర్స్ కాదని గతంలో వీరిద్దరికి పెళ్లి అయ్యిందని తెలిసింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. వేరువేరు కులాలు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

 

ఇక పెళ్లయిన రెండు నెలల తర్వాత అత్తింటి వాళ్ళు అమ్మాయిని తక్కువ కులం అంటూ వేధించడం మొదలు పెట్టడంతో అమ్మాయి తిరిగి కన్నవారి ఇంటికి వచ్చి మళ్లీ తన జీవితాన్ని యధావిధిగా సాగిస్తూ ఉండగా ఇక అతడు తనకు మాయ మాటలు చెప్పి లాడ్జికి పిలిపించి దారుణంగా పొడిచి చంపాడు. అయితే మరణించిన యువతి తల్లి జరిగిన సంఘటన గురించి తాజాగా కొన్ని విషయాలు తెలిపింది.

 

తమ కూతుర్ని ఇంత దారుణంగా చంపిన వాడిని ఉరిశిక్ష వేయాలి అంటూ తమకు న్యాయం చేయాలి అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక యువతి తల్లి మాట్లాడుతూ.. ఇక తన కూతురు సచివాలయంలో ఎంప్లాయ్ అని.. కరోనా సమయంలో తన కూతుర్ని ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ 2020లో తన కూతురు.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని తనకు చెప్పిందని తెలిపింది.

 

దాంతో సరేలే అని కూతురి ఇష్టాన్ని కాదనకుండా తాము ఒప్పుకున్నామని తెలిపింది. అయితే తన కూతురు పెళ్లి అయిన రెండు మూడు నెలలకే తిరిగి ఇంటికి వచ్చేసింది అని.. ఇక తన కూతురు తనతో.. అతడు మంచివాడు కాదని.. చాలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ బాధపడిందని తెలిపింది.

 

ఇక పెళ్లయినప్పటి నుంచి తన అత్త, ఆడపడుచు తక్కువ కులం అని ఆమెను వేధించడం మొదలుపెట్టారని.. కనీసం తినడానికి కూడా భోజనం పెట్టే వాళ్ళు కాదు అని.. ఒకవేళ తింటే డబ్బులు అడిగేవారని తన కూతురు తెలిపిందని తెలిపింది. ఇక తము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళము అని.. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళో తనకు తెలియదు అని.. అలా తమది తక్కువ కులం కావడంతో తమ కూతురుని వేధించారు అని తెలిపింది.

 

ఇక తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత.. రెండు సంవత్సరాల నుంచి తమ కూతురు తమ దగ్గరనే ఉంటుందని.. ఇక ఆఫీస్ కి వెళ్తుంటే మధ్యలో బస్ స్టాప్ దగ్గరికి అతను వచ్చి వేధించేవాడని.. తన కూతురు ఎక్కడికి వెళ్తే అక్కడ అతడు వచ్చి బాగా టార్చర్ చేయడం లాంటిది చేసేవాడని తెలిపింది. ఇంటికి రాకపోతే చంపేస్తాను అని బెదిరించేవాడని తెలిపింది.

 

తన కూతురు లాడ్జికి ఎందుకు వెళ్లిందో అన్న విషయం తమకు తెలియదని.. రోజుకి వెళ్ళినట్లే డ్యూటీకి వెళ్లిందని.. ఒకసారి ఫోన్ చేస్తే ఆఫీసులోనే ఉన్నాను అని చెప్పిందని తెలిపింది. ఇక తిరిగి తను సాయంత్రం ఫోన్ చేస్తే ఎవరో ఒక వ్యక్తి లిఫ్ట్ చేసి ఇలా జరిగిందని చెప్పాడని తెలిపింది. ఇక ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. కానీ ఇదంతా అతడే ప్లాన్ చేసుకొని చంపాడని తెలిపింది. ఇక వాడిని మాత్రం అస్సలు వదలొద్దని.. అసలు తన కూతుర్ని ఎలా చంపుతాడు అని.. తన కూతుర్ని ఎంత దారుణంగా చంపాడో వాడిని కూడా అంతే దారుణంగా చంపాలి అంటూ.. ఎలాగైనా అతడికి ఉరిశిక్ష పడాలి అంటూ తెలిపింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -