Urvasi: ఫ్లైట్లో అవి పోగొట్టుకున్న ఊర్వశి.. దొరికితే ఇవ్వండంటూ పోస్ట్?

Urvasi: తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ నటి ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఊర్వశి రౌతేలా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఆమె అందానికి బాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్ర కారుకు హీటెక్కిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

కాగా ఇటీవలే ఊర్వశి ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్​ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఊర్వశి రౌతేలా కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్​లోనే మర్చి పోయిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టింది. డియర్​ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను.

 

వాటి వాల్​ పేపర్​లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా అంటూ రాసుకొచ్చింది ఊర్వశి రౌతేలా. కాగా ఈ ట్వీట్ పై నిటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఇకపోతే ముద్దుగుమ్మ తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. వాళ్తేరు వీరయ్య సినిమాలో బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులు వేసింది. అలాగే మరికొన్ని సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో మెరవనుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటిస్తున్న బ్రో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో చేస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -