Vanga Baba: అమెరికా వల్ల యుగాంతం.. వంగబాబా భవిష్యవాణి!

Vanga Baba: వంగ బాబా అసలు పేరు వాంజెలియా పాండెవా గుస్తెరోవా. ప్రజలు ఆమెను వంగ బాబా, బాబా వంగ అని పిలుస్తారు. 1970 నుంచి 1980 మధ్య ఆమె చాలా రకాల భవిష్యత్తు అంచనాలను తెలిపారు. ఆమె 1996లో చనిపోయారు. అయితే చనిపోయి 25 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె ఏం చెప్పింది అన్న విషయాల పై తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమెరికా కూడా సంబంధించి ఆమె చెప్పిన ఓ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదేమిటంటే..వంగబాబా అంచనల్లో 85 శాతం నిజం అయ్యాయని, వార్సా ఒప్పందం, 9/11 దాడులు, బ్రెగ్జిట్‌, ఇందిరా హత్య, ఐసిస్ విషయాలను ఆమె ముందే వెల్లడించారట.

అలాగే అమెరికా 44వ అధ్యక్షుడు ఆఫ్రికన్ అమెరికన్ అవుతారని చెప్పగా అది కూడా జరిగిందట. అలాగే 2022 సంవత్సరం లో కొన్ని ఆసియా దేశాలు, అలాగే ఆస్ట్రేలియాలో వరదలు వస్తాయని చెప్పగా అదే జరిగిందట. అదేవిధంగా యూరప్ లోని పలు దేశాల్లో నీటి కొరత ఉంటుందని చెప్పగా అది కూడా జరిగిందట. 2023లో భూమి కక్ష్యా మార్గం మారుతుందనీ, 2028లో వ్యోమగాములు శుక్రగ్రహం చెంతకు వెళ్తారని అంచనా వంగ బాబా తెలిపిందట. 2046 నుంచి అవయవ మార్పిడి టెక్నాలజీ వల్ల ప్రజలు 100 ఏళ్లకు పైగా బతుకుతారని వంగ బాబా చెప్పారట.

అదేవిధంగా 2040 నుంచి 43 మధ్య యూరప్ ఖండం ఇస్లామిక్ ఖండం అవుతుందని తెలిపారు. అమెరికా పర్యావరణ నాశిని అనే ఆయుధాన్ని తయారుచేస్తుందని తెలిపారట. 2100 నుంచి భూమికి రాత్రి అనేది ఉండదనీ చీకటి ఉండేవైపున నిరంతరం కృత్రిమ సూర్య కిరణాలు ప్రసరిస్తాయని వంగబాబా అంచనా వేసి వెల్లడించారట. అయితే వంగ బాబా చెప్పిన మాటలను బట్టి చూస్తే పర్యావరణ నాశనం అనే ఒక ఆయుధం ప్రపంచం మొత్తం నాశనం చేస్తుందా అన్న భయం, అనుమానం ప్రజలకు కలుగుతోంది. అలాగే కొంతమంది ప్రజలు అమెరికా వల్ల యుగాంతం రాబోతోందా అనే ఆందోళనలో ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -