Maharajaganj: ప్రస్తుత కాలంలో ఎంతో మంది మహిళలు పురుషులు తమ జీవిత బాగస్వాములతో కాకుండా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అధికమయ్యాయి. ఇలా ఎంతో మంది రహస్యంగా చీకటి కాపురాలకు తెర లేపుతున్నారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి వారి భాగస్వామిలకే చివరికి పాడి కడుతున్నారు ఇలా ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి సంఘటనలు రోజురోజుకు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఓ కోడలు తన గదిలో ఏకంగా ఇద్దరు ప్రియులతో రొమాన్స్ చేస్తూ అత్తకు అడ్డంగా బుక్ అయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే…ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ జిల్లా నిచ్లాల్ పరిధిలోని ఓ గ్రామం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే భర్త సంపాదన నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లారు కానీ భార్య ఇక్కడే ఉంటూ తరచూ తన పుట్టింటికి బంధువుల ఇంటికి అంటూ వెళ్లేది. ఇక తన అత్తయ్య కూడా తనకు ఏమీ అడ్డు చెప్పేదికాదు.
తన కోడలితోపాటు ఇద్దరు అబ్బాయిలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవారు. అయితే వాళ్ళు ఎవరు ఏంటి అని తన అత్తయ్య ఆరా తీయగా తమ బంధువులు అబ్బాయిలు అని చెప్పేవారు. అయితే ఒకరోజు ఆ ఇద్దరు అబ్బాయిలు ఇంట్లోకి వచ్చే సరాసరిగా తన కోడలు పడక గదిలోకి వెళ్లారు అనుమానం వచ్చిన తన అత్త అక్కడికి వెళ్లి చూడగా తన కోడలు ఆ ఇద్దరితో కలిసి రొమాన్స్ చేస్తూ అత్తకు అడ్డంగా దొరికిపోయారు.
ఇలా తన కోడలిని ఆ స్థితిలో చూసిన అత్త ఏం చేయాలో దిక్కుతోచక ఆ గదికి తాళం వేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సరాసరి ఇంటికి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా తన కోడలితో పాటు, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విధంగా ఒకేసారి ఇద్దరు ప్రియులతో కలిసి ఆ యువతి రొమాన్స్ చేస్తూ పట్టుబడిందన్న ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.