Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటనతో ప్రాణం పోసిన నటి ఎవరంటే?

Ambajipeta Marriage Band: సుహాస్, శివాని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. గీత ఆర్ట్స్ టు బ్యానర్ తో పాటు ధీరజ్ మిగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని నిర్మించారు సినిమాకి దృశ్యం కటికనేని దర్శకుడు. నిజానికి మొదట ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు కానీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారిగా సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది.

 

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు గుడ్ ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరో సుహాస్ కానీ అతనిని డామినేట్ చేసింది అతని అక్క పద్మ పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ నిజానికి ముందు నుంచి ఈ సినిమాకి హీరోగా సుహాస్ నీ ప్రమోట్ చేస్తూ వచ్చారు అయితే చివరిలో మాత్రమే ఈ సినిమాలో శరణ్యవకా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంటుందని చెప్పారు.

నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలాగా నటించిన మెప్పించింది ఆమెలో ఇంత మంచి నటి దాగుందని విషయం ఫిదా సినిమా అప్పుడే అందరికీ తెలిసింది ఫిదా సినిమాలో కూడా సాయి పల్లవికి అక్కగా నటించి సినీ విమర్శకుల మెప్పు పొందింది శరణ్య. నిజానికి ఈమె తన కెరీర్ ని న్యూస్ రీడర్గా స్టార్ట్ చేసింది తర్వాత వెండితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఫిదా సినిమాలో హీరోయిన్ సోదరి పాత్రలో నటించారు శరణ్య.

 

ఆ తరువాత సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ లో లీడ్ రోల్ లో మెరిసింది. ఇక ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్రాండ్ లో కీలక పాత్ర అనే కన్నా హీరో పాత్ర అనటమే బెటర్ అంత బాగా నటించి సుహాసిని డామినేట్ చేసింది ఈ భామ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -