Sangareddy: కుటుంబాన్ని చంపేందుకు ఇంటికి కరెంట్ షాక్ పెట్టి ఆపై?

Sangareddy: రాను రాను సమాజంలో మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి మృగాలుగా మారి ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని చంపడం అన్నది సునాయాసంగా చేసేస్తున్నారు. చంపి ఊరుకుంటున్నారా అంటే ఆపై ముక్కలు ముక్కలుగా నరికేయడం వాటిని విసిరేయడం లాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇంకా నడిరోడ్డుపైనే హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. అలా మనుషులు మానవత్వం అన్న మాటనే మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు.

తాజాగా కూడా అటువంటి దారుణమే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవనరావు పేటలో రాములు,రామవ్వ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే రాములు రోజూ రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తుండేవాడు. కానీ, తాజాగా శనివారం రోజూ మాత్రం పొలానికి వెళ్లకుండా రాములు అలాగే పడుకున్నాడు. అయితే రాములు భార్య రామవ్వ తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి తలుపులు తీయబోయింది.

వెంటనే ఆమె కరెంట్ షాక్ తో కిందపడింది. ఆ మహిళ ఒక్కసారిగా అరుపులు వేసింది. చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూడగా వారి ఇంటికి కొందరు గుర్తు తెలియని దుండగులు కరెంట్ షాక్ పెట్టారు. అది గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ కరెంట్ ను తొలగించి ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనతో రాములు కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాధితుడు రాములు ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాములు ఇంటికి కరెంట్ షాక్ పెట్టింది ఎవరు? ఎందుకు వారిని హత్య చేయాలనుకున్నారనేది దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -