Nitya Menen: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది మలయాళీ ముద్దు గుమ్మలు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నారని చెప్పాలి.ఇప్పటికే నిత్యామీనన్ సంయుక్త మీనన్ సాయి పల్లవి అనుపమ వంటి వారందరూ మలయాళ ఇండస్ట్రీకి చెందినవారని చెప్పాలి. ఇలా తెలుగులో మలయాళీ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది.ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా నిత్యమీనన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించారు.ఈ సినిమా తర్వాత ఈమె ఇతర సినిమాలలో కనిపించలేదు ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే తనకు సీనియర్ హీరో వెంకటేష్ పక్కన నటించే అవకాశం వచ్చిందట.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం అనే సినిమాలో ముందుగా వెంకటేష్ సరసన నటించే అవకాశం నిత్యమీనన్ కి వచ్చిందట. అయితే ఈ సినిమా అవకాశం రావడంతో నిత్యమీనన్ ఏమాత్రం మొహమాట పడకుండా వెంకటేష్ పక్కన నేను నటిస్తే అంకుల్ పక్కన నటించినట్టు ఉంటుందని చెప్పడంతో ఒక్కసారిగా ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.
ఈ విధంగా నిత్యామీనన్ అంకుల్ పక్కన నటించనని చెప్పడంతో వెంకటేష్ సైతం ఫీలయ్యారని తెలుస్తోంది. ఇక ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారడమే కాకుండా ఎంతో మంది నిత్యమీనన్ కి హెడ్ వెయిట్ ఎక్కువ అని తనపై విమర్శలు చేశారు. నిత్యమీనన్ ఈ సినిమాలో నటించడానికి ఇష్టత చూపకపోవడంతో తిరిగి ఈ సినిమాలో నయనతారను తీసుకున్నారు.