Mangalasutra: మీ మంగళసూత్రంలో ఇవి ఉన్నాయా.. అవి లేకపోతే భర్త ప్రాణాలకే అపాయమంటూ?

Mangalasutra: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలో కట్టే ఈ మంగళసూత్రం భర్త ఆయుష్షుకి ప్రతిరూపం. ఇలా పెళ్లి తర్వాత ప్రతి ఒక్క స్త్రీ తమ మాంగల్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లి తర్వాత మహిళ ప్రతిరోజు పసుపు కుంకుమలతో మాంగల్యాన్ని కూడా పూజిస్తూ ఉంటుంది.

ఇక పెళ్లి సమయంలో పసుపు దారంతో మూడు ముళ్ళు వేసిన అనంతరం అమ్మాయి మెడలో పూసలు గుచ్చి మాంగల్యాన్ని మరోసారి వరుడు ఆమె మెడలో వేస్తారు ఈ సమయంలోనే చాలామంది మంగళసూత్రంలో ముత్యాలు పగడాలను వేస్తూ ఉంటారు. ముత్యాలు పగడాలు ఉండడం భర్త ఆయుష్షుకు సంకేతం. ఇలా మంగళసూత్రంలో ముత్యాలు పగడాలు ఉండటం వల్ల భార్య భర్తలకు ఏ విధమైనటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

 

మంగళ సూత్రానికి మాత్రం పగడం యాడ్ చేయడం చాలా మంచిదట. దీనికి అసలు కారణం… కుజుడు, చంద్రుడికి ప్రతీకలైన ఈ రెండు రాళ్లు గృహ దోషాలను తొలగించి తమ పసుపు కుంకాలను కాపాడతాయని భావిస్తూ ఉంటారు. కుజగ్రహ దోషం కారణంగా మహిళల ఎక్కువగా కోపం, కలహాలు, గొడవలు, ఆరోగ్యం లాంటి సమస్యలు వస్తుంటాయి. పగడం ముత్యం ధరించడం వల్ల ఇవేమీ రావని పెద్దవాళ్లు నమ్ముతూ ఉంటారు.ఇలా మహిళలు ధరించే మంగళసూత్రంలో ముత్యాలు పగడాలు లేకపోతే తన భర్త ఆయుష్షుకి కూడా ప్రమాదమని అందుకే వీటిని ధరించడం వల్ల తన పసుపు కుంకములు పది కాలాలపాటు క్షేమంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -