Karnataka: సాధారణంగా స్కూల్ లేదా కాలేజీ చదివే విద్యార్థులు స్టేట్ లో ఫస్ట్ ర్యాంకు సాధిస్తే లేదా తమ స్కూల్ కాలేజీలో ఫస్ట్ ర్యాంకు సాధిస్తే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ విద్యార్థులను అభినందిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఓ విద్యార్థి ఇంటర్ పాస్ కావడంతో తన స్నేహితులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన మిత్రుడికి సర్ప్రైజ్ ఇచ్చారు.అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ మిత్రుడిని గర్వపడేలా చేయడం ఏమో కానీ తన పరువు మొత్తం తీశారు అని చెప్పాలి.
కర్ణాటకకు చెందిన నితిన్ అనే విద్యార్థి ఇంటర్ 35 శాతం మార్కులతో పాసయ్యాడు. అయితే ఆ విద్యార్థి మొదటిసారి కాకుండా ఏకంగా ఆరోసారి ఇంటర్ 35 శాతం మార్కులతో పాస్ అవడంతో ఒక్కసారిగా తమ స్నేహితులు ఆ విద్యార్థి ఫ్లెక్సీలు వేయడమే కాకుండా ఆరోసారి ఇంటర్ పాసయ్యారంటూ కూడా ఫ్లెక్సీ ద్వారా తెలియజేశారు. ఇక తనకు 35.83 శాతం మార్కులు వచ్చాయి.
ఇక ఈ ఫ్లెక్సీలో 35 ను చిన్నగా వేసి 83 ను హైలెట్ చేస్తూ తమ మిత్రుడు ఆరవసారి ఇంటర్ పాస్ అయ్యారని ఫ్లెక్సీ వేస్తూ తనకు అభినందనలు తెలియజేయడం ఏమో కానీ ఆరోసారి కూడా కేవలం 35 శాతం మార్కులతో పాస్ అయ్యారని మిత్రుడి పరువు తీసినట్టు ఉంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక స్నేహితుల ఉత్సాహం చూస్తుంటే తన మిత్రుడు ఆరోసారి పాస్ అయినందుకు పెద్ద ఎత్తున దావత్ కూడా ఏర్పాటు చేసిన చేస్తారని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్స్ ఆరోసారి పాసైన ఇలా ఫ్లెక్సీలు వేస్తారా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు వాడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.