CM Jagan: కుడి చేత్తో జనాలకి డబ్బు ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటున్న జగన్.. జనాలకు అర్థమవుతోందా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసారు .ఈయన కేవలం తన సొంత పార్టీ నేతలు తన స్వలాభం కోసమే అడ్డుగోలుగా కబ్జాలు నిర్వహిస్తూ భారీగా ఆస్తులను కూడా పెట్టుకున్నారు కానీ రాష్ట్ర ప్రజలను మాత్రం నిలువునా ముంచుతున్నారు. ఈయన పేరుకే సంక్షేమ పథకాలను అందిస్తున్నారు కానీ ఒక చేతితో సంక్షేమ పథకాలను అందిస్తూ మరో చేతితో ప్రజల నుంచి లాక్కుంటున్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును దోచుకుని తిరిగి వారికి ఇస్తున్నారంటే ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వంటి వారందరూ కూడా బహిరంగ సభలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి మీకు ఒక పథకం ఇస్తున్నారు అంటే మీ దగ్గర నుంచి కరెంటు బిల్లు, ఇంటి పన్ను చెత్త పన్ను నీళ్ల పన్ను అంటూ భారీ స్థాయిలో డబ్బులను లాక్కుంటున్నారని తెలిపారు.

ఇలా ప్రజల మీద అధిక భారాన్ని మోపుతూ పెద్ద ఎత్తున టాక్స్ ల రూపంలో తీసుకోవడం తిరిగి ఆ డబ్బును పథకాల రూపంలో ప్రజలకు అందిస్తూ తన గొప్పను చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈయన తన సొంత డబ్బును పంచి పెడుతున్నట్లు మాత్రం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఉపయోగించి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ బటను నొక్కే కార్యక్రమాలను పెట్టుకుంటున్నారు.

ఇటీవల భీమిలి వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వింటేనే జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి ఎలా డబ్బును దోచుకుంటున్నారో అర్థమవుతుంది కరెంటు బిల్లు మాకు అధికంగా వస్తుందని మహిళలు ప్రశ్నించడంతో ఈయన మీకు చేయూత వస్తుంది కదా అమ్మ అంటూ ప్రశ్నించారు. ఇలా ఎమ్మెల్యే ప్రశ్నతోనే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అనే విషయాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -