Chandrayan 3: తాజాగా భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం 140 కోట్ల మంది కలల్ని, ఆశయాలను నిజం చేసిందని, ఇది భారతీయులకు నిజంగా ఎంతో గర్వకారణమంటూ ఉప్పొంగిపోతున్నారు.
ఈ ఘన విజయాన్ని తరతరాలు గుర్తు పెట్టుకుంటాయని, ఇందుకు కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా చంద్రయాన్ 3 విజయాన్ని పురస్కరించుకుని ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధిపతులు, అధ్యక్షులు భారత్కు, ఇస్రోకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నటి సెహర్ షిన్వారీ కూడా చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా భారత్కు అభినందనలు తెలిపింది. భారత్లో శత్రుత్వాన్ని పక్కన పెడితే ఇస్రోను అభినందించాల్సిందే.
సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భారత్ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఈ ఘనతను అందుకోవడానికి పాకిస్తాన్కు మరో 2,3 దశాబ్దాలు పడుతుంది. భారత్ ఎంత ఎత్తుకు ఎదిగిందో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. దురదృష్టవశాత్తు ఈ రోజు మన దుస్థితికి మనం తప్ప మరెవరూ కారణం కాదు. అన్న విషయాన్ని పాకిస్తాన్ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి అని పాక్ నటి సొంత దేశంపైనే సెటైర్లు వేస్తూ ఇండియాని ప్రశంసలతో ముంచేత్తింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.