Mallareddy: మల్లారెడ్డి కోడలు గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Mallareddy: మల్లారెడ్డి పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలను నడుపుతూ విద్యావేత్తగా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన అనంతరం రాజకీయాలలోకి వచ్చి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా మల్లారెడ్డి తరచూ మీడియాతో మాట్లాడుతూ తన ఫన్నీ స్పీచ్ లతో ఎంతో ఫేమస్ అయ్యారు.ఇలా ఈయన పలుసార్లు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో తన కుమారుడు కంటే కోడలు గురించి ఎక్కువ ప్రస్తావన తీసుకువచ్చేవారు.

 

ఈ విధంగా మల్లారెడ్డి తరచూ తన కోడలు ప్రీతి గురించి మాట్లాడటంతో అసలు ఈ ప్రీతి ఎవరు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఈమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రీతి రెడ్డి తన గురించి తన అత్తమామల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి వృత్తిపరంగా డాక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈయనకు ప్రీతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేశారు.

ఈమె కూడా వృత్తిపరంగా డాక్టర్. ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత ప్రీతి రెడ్డి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కి ఎండిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈమె చదువుతున్న రోజులలోనే నాట్యం పై ఎంతో మక్కువ ఉండటంతో నృత్యకారునిగా మారి పలు స్టేజి షోలు చేశారు.ఇలా ఎంతో టాలెంట్ కలిగినటువంటి ప్రీతి రెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కి ఎండిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… తాను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లిని కోల్పోయానని తెలిపారు.

 

ఇలా తల్లిని కోల్పోయిన నేను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అడుగు పెట్టిన తర్వాత తన అత్తయ్య తనకు తల్లిగా మారిపోయారని తనకు తల్లి లేని లోటు తీర్చారని తెలిపారు.తాను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పురుడు కోసం పుట్టింటికి వెళ్లే పని లేకుండా తన అత్తయ్య తనకు అడగకముందే అన్ని దగ్గరకు తీసుకొచ్చి పెట్టేవారని తనకు అమ్మలేని లోటును అత్తయ్య తీర్చారని తెలిపారు.తాను తన అత్తయ్యను అత్తయ్య అని కాకుండా అమ్మ అని పిలుస్తానంటూ ఈ సందర్భంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యుల మంచితనం గురించి ప్రీతి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -