Priyamani – Mustafa Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. అలాగే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు ఒక వివాహం జరిగి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఇలా ముస్తఫా రాజ్ ను రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్న ప్రియమణి తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక తన భర్త ప్రోత్సాహంతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించినట్లు ఈమె పేర్కొన్నారు. ఇకపోతే వీరి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరు.అయితే పిల్లల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన ప్రియమణి తను జీవితంలో సెటిల్ అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాను అంటూ మాట దాటి వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తరచూ వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తుతున్నట్లు సమాచారం.
ఇలా పిల్లల విషయంలో ప్రియమణి ముస్తఫా రాజ్ మధ్య గొడవలు తలెత్తడంతో ఈ జంట ఏకంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ప్రియమణి ముస్తఫా రాజ్ విడాకులు తీసుకోబోతున్నారని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.అయితే ఈమె విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని భావిస్తున్నారు.