Ambassador: 1964 బిల్ చూశారా.. అంబాసిడర్ కార్ అంత తక్కువా?

Ambassador: అంబాసిడర్ కార్.. చాలామందికి ఈ కారుని కొనడం ఒక డ్రీమ్ అని చెప్పవచ్చు. కానీ ఈ కారు ధర ఇప్పట్లో ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు, అలాగే బాగా డబ్బు ఉన్న సామాన్య వ్యక్తులు కూడా చాలామంది ఈ కారులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ అంబాసిడర్ కార్ ని కొనుగోలు చేయాలని ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పుడంటే ఓకే కానీ ఒకప్పుడు అంబాసిడర్ కార్ కి భారీగా క్రేజ్ ఉండేది. అంబాసిడర్ కార్లు అప్పట్లో రోడ్డుపై వెళ్తుంటే అందరూ నోరెళ్ళ పెట్టి వింతగా చూసేవారు.


ఈ కార్లు ఎక్కువగా తెలుపు రంగులోనే కనిపించేవి. అప్పట్లో అంబాసిడర్ కారును ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రెటీస్ వాడేవారు. కానీ ప్రస్తుతం ఈ కార్ల వాడకం తగ్గింది. అయితే అంబాసిడర్ కారు ధరకు సంబంధించి ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంబాసిడర్‌ తోనే కార్లంటే క్రేజ్ ఏర్పడింది.

గతంలో ఎక్కువగా రాజకీయ నాయకులు, అలనాటి స్టార్ హీరోలు వాడుతూ ఉండేవారు. సినిమాలలోనూ ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పట్లో అంబాసిడర్ కారు ఉందంటే, వారిని గొప్పగా, ధనవంతులుగా చూసేవారు. ఎన్ని రకాల కార్లు వచ్చినప్పటికి అంబాసిడర్ కారు రేంజ్ వేరు. 1990 దశకం దాకా ఈ కార్ల హవా నడిచిందని చెప్పవచ్చు.

ఈ కారును 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఈ కార్ బ్రిటిష్ కారు ఆధారంగా తయారు చేయబడింది. మారుతీ సుజుకీ వచ్చినప్పటి నుండి ఈ కార్లకు ఆదరణ తగ్గింది. హిందూస్థాన్ మోటార్స్ 2014లో వీటి ఉత్పత్తిని ఆపివేసింది. అప్పుడు ఆ కారు ఖరీదు నాలుగు లక్షలకు పైన ఉండేది. అయితే ఈ కార్లను ఇంకా ఇష్టం పడేవారు. ఇప్పటికి కూడా ఆ కార్లను రిపేర్లు చేయించుకుంటూ వాడుతున్నారు. అయితే ఈ కారు వచ్చిన తొలి రోజుల్లో ఖరిదు ఇంతా అని చెప్పలేం. తాజాగా 1964 లోని అంబాసిడర్ కార్ యొక్క ఇన్వాయిస్ బిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బిల్ లో దాని ఖరీదు 16, 495 రూపాయలు అని ఉంది. 1964వ సంవత్సరంలో మద్రాసులో ఉండే గుప్తాస్ స్టేట్స్ హోటల్‌ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా ఆ ఇన్వాయిస్ బిల్ లో ఉంది.

కాగా దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఈ ఇన్ వాయిస్ బిల్ లో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు ఉన్నాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ బిల్ ను చూసిన నెటిజన్లు అప్పట్లో అంబాసిడర్ కారు అంత తక్కువగా ఉండేదా అని ఆశ్చర్య పోతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -