Jackie Shroff: రామాలయ ప్రాంగణంను శుభ్రం చేసిన ఈ నటుడి గురించి తెలుసా?

Jackie Shroff: ఈ జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో బాల రామునికి ప్రతిష్టాపన జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భారతదేశం అంతా అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన హడావిడిలో ఉన్నారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు ముంబైలో ఒక రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయారు. ఆ బాలీవుడ్ నటుడు మరెవరో కాదు జాకీ ష్రాఫ్.

 

ముంబైలోని ఒక రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో ఈయన పాలుపంచుకున్నారు. మెట్లను తుడుస్తూ, ఆ గుడి పరిసరాలను కూడా శుభ్రం చేస్తూ కనిపించిన జాకీ ష్రాఫ్ ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి ఎన్నో లైకులు వచ్చి జాకీ ని అందరూ మెచ్చుకున్నారు. జాకీ ష్రాఫ్ అమితమైన రామభక్తుడు అని చాలామందికి తెలీదు. తన సినిమాలు విడుదలైనప్పుడు కూడా రామునిని ప్రార్థించే వారట.

రాముడికి పరమ భక్తుడు అయిన జాకీశ్రాఫ్ రామునికి సేవలు చేసుకుంటూ కనిపించిన ఈ వీడియోని చూసి అభిమానులందరూ ఈయనని పొగుడుతున్నారు. కేవలం ఈ విషయంలోనే కాకుండా ఏ సేవా కార్యక్రమాలలో అయినా జాకీ ష్రాఫ్ ముందు అడుగు వేస్తారు. కనుక అయోధ్యలో రామ ప్రతిష్టాపన సమయంలో ఈ వీడియో వైరల్ అవ్వడం వలన అభిమానులు అందరి మధ్య మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఈ బాలీవుడ్ నటుడు.

 

కానీ సినిమాలు విషయానికొస్తే జాకీ ష్రాఫ్ కి సరైన కం బాక్ ఇంకా రాలేదు అనే చెప్పాలి. ఒకప్పుడు హీరోగా నటించి ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న జాకీ ష్రాఫ్ కి ఇప్పటికీ ఒక హిట్టు కూడా ఈ మధ్యకాలంలో పడలేదు. ఇతని కొడుకు టైగర్ ష్రాఫ్ కి కూడా సరైన హిట్ దొరకకపోవడంతో ఇంత అమితమైన రామ భక్తుడికి మంచి కం బ్యాక్ రావాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -