Kajal Aggarwal: తిరుమలలో సందడి చేసిన నటి కాజల్.. ఫోటోలు వైరల్!

Kajal Aggarwal: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ అగర్వాల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే 2020 సంవత్సరంలో నటి కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే పెళ్లయిన కొద్ది నెలలకే కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నారని తెలియడంతో ఈమె కమిట్ అయిన సినిమాలకు దూరమయ్యారు. ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటున్నటువంటి కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్న విషయం మనకు తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత ఈమె నటిస్తున్నటువంటి మొదటి సినిమా కావడంతో తన శరీర ఫిట్నెస్ కోల్పోయిన కాజల్ అగర్వాల్ తిరిగి శరీర ఫిట్నెస్ కోసం పెద్ద ఎత్తున కసరత్తులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నై వచ్చినటువంటి కాజల్ అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

మంగళవారం విఐపి విరామ సమయంలో కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పండితులు వీరికి సాధర స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల సందడి చేసిన కాజల్ అగర్వాల్ భారతీయుడు2 సినిమా షూటింగ్ నిమిత్తంలో భాగంగా తాను స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు. ప్రస్తుతం కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -