Nayanthara: ఆ బాధ్యతల కోసం నటనకు గుడ్ బై?

Nayanthara: తెలుగు ప్రేక్షకులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చంద్రముఖి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

మొత్తానికి నయనతార అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లో తన సత్తాని చాటుకుంటుంది. ఇక బాలీవుడ్లో అడుగుపెట్టిన నయనతార తన నటనతో బీటౌన్ ప్రేక్షకులతో ఊహించని స్థాయిలో మెప్పించుకుంటుంది. తెలుగు, తమిళ చిత్రాలతో యమా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు రెమ్యూనేషన్ విషయం లో కూడా ఏమాత్రం తగ్గకుండా పుచ్చుకుంటుందట.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార అభిమానులు ఆందోళన చెందే విధంగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. నయనతార సినీ రంగంలో సంపాదించిన సొమ్ము ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తన భర్త విఘ్నేశ్ శివన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అమ్మడు త్వరలో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్తుంది అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినపడుతున్నాయి.

ఇక నయనతార పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన వ్యాపారాలను చూసుకుంటూ.. తన జీవితాన్ని హ్యాపీగా గడపాలి అన్నట్లు భావిస్తుందట. ఇక ఇందులో ఇంకో విషయం ఏమిటంటే.. నటనపరంగా దూరంగా ఉంటూ మంచి మంచి సినిమాలకు నిర్మాతగా వహించే ప్రయత్నంలో ఉందని మరి కొందరు అనుకుంటున్నారు.

మొత్తానికి నయనతార సినిమాలకు దూరంగా ఉండే విషయాన్ని తన అభిమానులు ఏమాత్రం తీసుకోలేకపోతున్నారు. మరి.. ఆందోళన చెందుతున్న అభిమానులకు.. నయన్ తీపి వార్తను చెబుతుందా.. లేక చేదు వార్తను చెబుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నయన్ మాత్రం తన భర్త విజ్ఞేశ్ శివన్ తో కలిసి చిల్ అవుతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -